కాకినాడ జిల్లా, పెద్దాపురంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా స్వచ్ఛతా ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. సీఎంతో పాటు ర్యాలీలో ప్రజాప్రతినిధులు, మెడికల్ విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం అక్కడి మ్యాజిక్ డ్రెయిన్లను సీఎం పరిశీలించారు. వాటి నిర్మాణం, ఉపయోగం గురించి పారిశుధ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వీటి ద్వారా భూగర్భ జలాల పెరుగుదలతో పాటు పారిశుధ్య నిర్వహణ భారం కూడా తగ్గుతుందని కార్మికుల వివరించారు.
#SwarnaAndhraSwachhAndhra
#MyCleanAP
#ChandrababuNaidu
#AndhraPradesh
స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్దాపురం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హెలీప్యాడ్ వద్ద స్వాగతం పలికిన కూటమి ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులు.
ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళి అర్పించారు.
#AndhraPradesh
CM Chandrababu Naidu urges Union Finance Minister to allocate additional ₹5,000 Cr under SASCI during his Delhi visit
Amaravati, August 22:* Chief Minister Nara Chandrababu Naidu, who visited Delhi on Friday, met Union Finance Minister Nirmala Sitharaman. The Chief Minister sought financial assistance from the centre for several developmental initiatives being undertaken in Andhra Pradesh. He highlighted that so far, the state has received ₹2,010 crore under the Special Assistance to States for Capital Investment (SASCI) scheme.
He submitted a representation seeking an additional allocation of ₹5,000 crore for pending capital projects in the state. The memorandum also requested necessary orders on the proposals submitted by the State Government for the release of ₹250 crore under the Single Nodal Agency (SNA Sparsh) incentive scheme guidelines for the financial year 2024-25.
Welcoming the Purvodaya scheme announced by the centre for the integrated development of eastern states, the Chief Minister said Andhra Pradesh would greatly benefit from it. He urged the centre to finalise the modalities for implementing the scheme at the earliest.
Delhi:-* NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్కు సీఎం చంద్రబాబు మద్దతు తెలిపారు.
ఢిల్లీలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గారి నివాసానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్లారు. రామ్మోహన్ నాయుడు దంపతులకు ఇటీవల జన్మించిన బాబుకు దీవెనలు అందించారు. రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులతో ముచ్చటించారు.
పీ4 కార్యక్రమం పై మంగళగిరి సీకే కన్వెన్షన్లో జరిగిన కార్యక్రమం లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగారు కుటుంబాలు, మార్గదర్శకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
#AndhraPradesh
గుంటూరు, తేదీ: 19.08. 2025
మంగళగిరిలోని సీకే కన్వేన్షన్ లో మంగళవారం జరిగిన ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజలు భాగస్వామ్య (పీ4) కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కార్యక్రమంలో స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు, ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్, జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ, ఏపీ ఎన్ఆర్టీ ఆధ్యక్షులు వేమూరి రవి, 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్, మహహ్మద్ నసీర్ అహ్మద్, గల్లా మాధవి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ, రాష్ట్ర లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ తేజ పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీ4 కార్యక్రమం ద్వారా లబ్ధి పోందిన బంగారు కుటుంబాల సభ్యులు, చేయుత అందించిన మార్గదర్శులతో మాట్లాడి వారు ఆర్ధికంగా ఎదుగుతున్న విధానం గురించి తెలుసుకున్నారు. కుప్పం నియోజకవర్గం కు సంబంధించి 250 బంగారు కుటుంబాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శిగా ఉంటూ వేదికపై ఏర్పాటు చేసిన అడాప్షన్ ట్రీ వద్ద వారిని దత్తత తీసుకున్నారు. బంగారు కుటుంబాలను, మార్గదర్శులను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా సన్మానించారు.
ఇన్నోవేషన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ఎపిని తీర్చిదిద్దుతాం
విద్యార్థి దశ నుంచే యువత ఆవిష్కరణలపై దృష్టిపెట్టాలి
*ప్రతిఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్నది బాబు ఆశయం
*సవాళ్లను అవకాశాలుగా మార్చుకొని ముందుకు సాగుదాం
*ఆవిష్కర్తలకు అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తాం
*రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవంలో మంత్రి లోకేష్
మంగళగిరి: ఆవిష్కరణలకు వనరులు అడ్డంకి కాదు, వినూత్నమైన ఆలోచనలే ముఖ్యం. ప్రతి యువకుడు విద్యార్థి దశ నుంచే మెరుపులాంటి ఆలోచనలతో ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. మంగళగిరి సమీపంలో ఎన్ హెచ్ -16 పక్కన కొత్తగా నిర్మించిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... ఇన్నొవేషన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ఎపిని తీర్చిదిద్దేందుకు దిగ్గజ పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలతో కలసి పనిచేసేందుకు మేం సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈరోజు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవంలో మీ ముందు నిలబడటం నాకు ఎంతో గర్వంగా ఉంది. ఇది కేవలం ఒక భవనం మాత్రమే కాదు – రాష్ట్రంలోని లక్షలాది యువతకు ఆశాకిరణం, విశ్వాస ప్రకటన, ఆంధ్రప్రదేశ్ ఏదైనా సాధించగలదనే వాగ్దానం. ఈ హబ్ భరతమాత ముద్దుబిడ్డ శ్రీ రతన్ టాటా జీ అత్యున్నత నైతిక విలువలు, మహోన్నత వ్యక్తిత్వ స్ఫూర్తితో నెలకొల్పబడింది. నేడు ఈ హబ్ను దివంగత రతన్ టాటాజీ ఆదర్శాలకు అంకితం చేస్తున్నాం. రాజకీయ నాయకుడిగానే మీకంతా తెలిసిన చంద్రబాబు గారు ఒక విజయవంతమైన పారిశ్రామికవేత్త. అయితే హెరిటేజ్ ప్రారంభానికి ముందు ఆయన మూడు కంపెనీలు పెట్టి విఫలమయ్యారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో రైతులకు సాయం చేయాలన్న సంకల్పంతో హెరిటేజ్ ప్రారంభించారు. ఆ సంస్థ ఈరోజు 12 రాష్ట్రాలకు విస్తరించి రూ.5వేల కోట్ల వ్యాపారం చేస్తోంది. వైఫల్యాలతో ఆయన తన ప్రయాణాన్ని ఆపలేదు. ఏదైనా సాధించాలంటే పట్టుదల, నిబద్ధత, ఓర్పు ఉండాలి. అప్పుడే మనం అద్భుతమైన ఫలితాలను సాధించగలం.
వచ్చే ఏడాది మార్చి కల్లా 10 లక్షల ఇళ్ల నిర్మాణం
నెల రోజుల్లో 3 లక్షల కుటుంబాలకు గృహప్రవేశాలు
ఇళ్లులేని పేదలను గుర్తించేందుకు 15 రోజుల్లో సర్వే
*గృహ నిర్మాణ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
*ఏడాది కాలంలో రూ.2,013 కోట్లు ఖర్చుపెట్టిన ప్రభుత్వం
*అమరావతి, ఆగస్ట్ 20 : రాష్ట్రంలో ప్రతీ పేద కుటుంబానికి సొంతిళ్లు ఉండాలని... ఇందుకోసం తలపెట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించిన ముఖ్యమంత్రి... వీటిలో 3 లక్షల ఇళ్లకు వచ్చే నెలలో గృహ ప్రవేశాలు జరగాలని స్పష్టం చేశారు. సంక్రాంతి కల్లా మరో 2 లక్షల ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలన్నారు. ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి నిర్మాణం చేపట్టాలని సూచించారు. బుధవారం సచివాలయంలో గృహ నిర్మాణ శాఖపై అధికారులతో సమీక్షించిన సీఎం....రాష్ట్రంలో ఇంకా ఇళ్లులేని పేద కుటుంబాలను గుర్తించి జాబితా రూపొందించాలని ఆదేశించారు. దీనిపై 15 రోజుల్లోగా సర్వే పూర్తి చేయాలన్నారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు పేద కుటుంబాలకు ఇస్తామన్న హామీ మేరకు అవసరమైన స్థలాలను గుర్తించాలన్నారు. పెద్ద కుటుంబాలకు ఉమ్మడి ఇళ్లు నిర్మించే యోచన చేయాలన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ పూర్తి చేసేందుకు విడతల వారీగా నిధులు ఇవ్వాలని చెప్పారు.
*త్వరలో 2,73,709 మంది లబ్దిదారులకు రూ.919 కోట్ల చెల్లింపు 😗
రాష్ట్రానికి పీఎంఏవై(అర్బన్)బీఎల్సీ, పీఎంఏవై (గ్రామీణ్), పీఎం జన్మాన్ కింద మొత్తం 18,59,504 ఇళ్లు మంజూరు కాగా, వీటిలో ఇప్పటికి 9,51,351 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. ఈ ఏడాది కాలంలోనే 2.81 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. వచ్చే నెలలో ఇంకో 19 వేల ఇళ్లు రహదారులు, డ్రైనేజీలు తదితర మౌలికవసతుల కోసం రూ.3,296.58 కోట్ల వ్యయం కానుంది. కుప్పం నియోజకవర్గంలో 4,647 మంది గృహ నిర్మాణ లబ్దిదారులకు రూ.16.37 కోట్లు చెల్లించగా, రాష్ట్రంలోని 2,73,709 మంది లబ్దిదారులకు రూ.919.29 కోట్లు త్వరలో చెల్లించనుంది. పీఎం జన్మాన్ కింద నిర్మించిన 15,753 ఇళ్లకు రూ.100 కోట్లు, పీఎంఏవై గ్రామీణ్ కింద నిర్మించిన 15,582 ఇళ్లకు రూ.75 కోట్ల నిధులు మంజూరు చేయనుంది. మరోవైపు పీఎంఏవై అర్బన్ కింద ఇళ్లు మంజూరైనప్పటికీ 1,84,510 మంది లబ్దిదారులు ఇంకా గృహ నిర్మాణం చేపట్టలేదని అధికారులు ముఖ్యమంత్రికి వెళ్లడించారు.
*తుది దశకు 84,094 టిడ్కో ఇళ్ల నిర్మాణం